హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్లో జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కోసం 17 సంత్సరల క్రితం ఒక్కొక్క జర్నలిస్ట్ రూ.2 లక్షల డబ్బులు కట్టారని.. మొత్తం 12.50 కోట్ల డబ్బులు కట్టారని తెలిపారు. జర్నలిస్టుల స్థలం జర్నలిస్టులకు ఇవ్వాలని తీర్పు కూడా వచ్చిందన్నారు.
జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టిస్తామని బండి సంజయ్ హామీ
జర్నలిస్టులకు స్థలం ఇస్తావా లేదా కేసీఆర్. జర్నలిస్ట్ల వల్లే నీకు సీఎం పదవి..నీ కుటుంబ సభ్యులు పదవులు వచ్చాయని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Translate this News: