Murder: నీళ్లు అడిగిన భర్త తల పగలగొట్టిన భార్య.. మెదడు బటయకు తీసి!

భోజనం చేస్తూ నీళ్లు ఇవ్వమని అడిగిన భర్త సత్యపాల్ ను భార్య సావిత్రి దారుణంగా చంపేసిన ఘటన యూపీలో జరిగింది. ఇటుకతో తల పగిలేలా కొట్టిన సావిత్రి.. భర్త డెడ్ బాడీపై కూర్చొని మెదడును బయటకు తీసి విసిరేసింది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Murder: నీళ్లు అడిగిన భర్త తల పగలగొట్టిన భార్య.. మెదడు బటయకు తీసి!
New Update

Wife killed Husbend: దాహం వేస్తోంది కొన్ని నీళ్లు ఇవ్వమని అడిగిన భర్తను భార్య దారుణంగా హతమార్చిన ఘటన యూపీలో సంచలనం రేపింది. కట్టుకున్న వాడు అనే కనికరం లేకుండా అతి కిరాతకంగా తల పగలగొట్టి డెడ్ బాడీతో మృగంలా ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా నలిగిన తలలోంచి మెదడు బయటకు తీసి కృరంగా ప్రవర్తించిన ఘటన షాజహాన్‌పూర్‌లో జరిగింది.

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హతోరా గ్రామానికి చెందిన సత్యపాల్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే భార్య సావిత్రితో తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం భోజనం చేస్తూ నీళ్లు కావాలని అడగడంతో ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. మాట మాట పెరిగి దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే సావిత్రి ఇటుకతో సత్యపాల్ తలపై దాడి చేసింది. సత్యపాల్ చనిపోయే వరకు వదలకుండా తలను బలంగా కొట్టింది. మృతదేహంపై కూర్చొని డెడ్ బాడీ తలలోంచి మెదడు బయటకు తీసి విసిరేసింది. స్థానికుల సమాచారం అందగానే ఘటన స్థలానికి చేరుకుని సావిత్రిని అదుపులోకి తీసుకున్నాం. సావిత్రి కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

#uttara-pradesh #husband-satyapaul #wife-savitri-killed
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe