మాదే అధికారం: కేటీఆర్, రాహుల్ గాంధీ ట్వీట్లు

ఎవరికివారు మాదే అధికారం అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది ఈరోజు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీలు తమ పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని ధీమాగా చెబుతున్నారు.

New Update
మాదే అధికారం: కేటీఆర్, రాహుల్ గాంధీ ట్వీట్లు

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా జరుగుతోంది. కానీ అప్పుడే ముఖ్యనేతలు స్పందించేస్తున్నారు. అధికారం మాదే అంటే మాదే అని పోటాపోటీగా ప్రటించేస్తున్నారు. హైదరాబాద్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ (KTR) తరువాత ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. తెలంగాణలో అన్నిచోట్ల నుంచి తమకు రిపోర్ట్‌లు వస్తున్నాయని...కారే టాప్ గేర్ లో ఉందంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ (Rahul Gandhi) కూడా ఇదే ధీమాను వ్యక్తం చేశారు. దొరల మీద ప్రజలు గెలబోతున్నారు. కాంగ్రెస్ దే విజయం అంటూ పోస్ట్ పెట్టారు. బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ కు ఓటు వెయ్యడానికి తరలి రండి అంటూ పిలుపునిచ్చారు.

Advertisment
తాజా కథనాలు