Bhatti Vikramarka: ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: భట్టి విక్రమార్క

TG: ఈరోజు ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు భట్టి విక్రమార్క. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అధికారం చేపట్టిన తొలిరోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించామన్నారు.

New Update
Telangana Elections: ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటారు? భట్టి సంచలన కామెంట్స్..

Deputy CM Bhatti Vikramarka: ఆదిలాబాద్ లో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు ఏఐసీసీ ఆదేశించిందని అన్నారు. నాడు పాదయాత్రకు ఇక్కడి నుంచే నాంది పలికాం అని చెప్పారు. ప్రజల ఎజెండాతో కాంగ్రెస్ ముందుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించారు కాబట్టే ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైందని అన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ప్రజల కోసమే పని చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన అధికారాన్ని తమ బాధ్యతగా నిర్వర్తిస్తున్నాం అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేశామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని భట్టి భరోసా ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు