Atishi Marlena: ఢిల్లీకి గత మూడు రోజులుగా హర్యానా ప్రభుత్వం కుట్ర పూరితంగా నీటి విడుదలను తగ్గించిందని ఢిల్లీ నీటి మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ట్విట్టర్ (X)లో ఆరోపించారు. ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇటీవల నగర ప్రజల అవసరాల కోసం 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన ఒక రోజు తర్వాత ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 'సుప్రీంకోర్టు ఢిల్లీ నీటిగులు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. గంటకు 28-38 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. కానీ, హర్యానా ఢిల్లీ ప్రజలపై కుట్ర చేస్తోంది. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉండగా, హర్యానా క్రమంగా ఢిల్లీకి విడుదల చేస్తున్న నీటిని తగ్గిస్తుంది. గత 3 రోజుల్లో చాలా వరకు నీటి ప్రవాహం తగ్గింది.' అని పేర్కొన్నారు. ఈ సమ్మర్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడం కారణంగా నీటి డిమాండ్ పెరిగింది, నగరంలో బోర్ల నుంచి తక్కువ మొత్తంలో నీరు బయటకు వచ్చేది. యమునాలో నీటి మట్టం కూడా తగ్గడంతో రాజధాని ప్రజలు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు