Salem : రెండు లారీల మధ్య భార్యభర్తలు నుజ్జునుజ్జు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

తమిళనాడులోని సేలం వద్ద కర్నాటక నుంచి వరిసాగు చేస్తున్న ట్రక్కు ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. వారి పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. రామన్ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Salem : రెండు లారీల మధ్య భార్యభర్తలు నుజ్జునుజ్జు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

Tamilnadu Salem Accident : తమిళనాడు(Tamilnadu) లోని సేలంలో రెండు ట్రక్కుల మధ్య ఓ జంట నుజ్జునుజ్జు అయ్యారు. ఈ యాక్సిడెంట్‌(Truck Accident) కు సంబంధించిన భయంకరమైన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ భయానక ఘటన కెమెరాలో చిక్కగా, వీడియో సోషల్ మీడియా(Social Media) లో హల్‌చల్ చేస్తోంది. దంపతులు(Couples) ఒక ట్రక్కు వెనుక వేచి ఉన్నారు, ఆ తర్వాత వేగంగా వచ్చిన మరొక ట్రక్ వచ్చి జంటను నలిపేసింది.

Also Read : జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవదహనం!

తమిళనాడులోని సేలంలోని రామన్ నగర్‌లో జరిగిన ఈ ఘటనలో దంపతులను అలగరసన్ (30), అతని భార్య ఇలమతి (25)గా గుర్తించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ప్రమాదం జరిగినప్పుడు వారు కూడా వారితో ఉన్నారు. ఈ ప్రమాదంలో కిషోర్ (5), కృతిక్ (2) అనే చిన్నారులు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతులు మాత్రం స్పాట్‌లోనే చనిపోయారు.

ట్రాఫిక్ కారణంగా రోడ్డుపై బస్సు ఆగిపోవడం, ఆ తర్వాత ఒక ట్రక్కు కూడా దాని వెనుకే వచ్చి ఆగడం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత వాటర్ ట్యాంకర్ లా ఉన్న లారీ వెనుక బైకర్ రావడం, వెనుక నుంచి మరో ట్రక్ వచ్చి బైకర్ ను ఢీకొట్టింది. తన కుటుంబంతో సహా దంపతులు రెండు ట్రక్కుల మధ్య నలిగిపోయారు.

Also Read : హైదరాబాద్‌లో మత్తు చాక్లెట్లు… విద్యార్ధులు, యువతే టార్గెట్

WATCH:

Advertisment
తాజా కథనాలు