/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Flights-1.jpg)
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో శనివారం ఓ ఘోర ప్రమాదం తప్పింది. ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా.. అదే రన్ వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు టేకాఫ్ కావడం టెన్షన్ పుట్టించింది. ఈ రెండు విమానాల మధ్య కొన్ని వందల మీటర్ల దూరమే ఉండడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.