Vijayasai Reddy: నీలాంటి కూతురు శత్రువుకి కూడా పుట్టాలని ఎవరూ కోరుకోరు.!

పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తండ్రికి ఒక్క ముద్ద కూడా పెట్టలేని నీలాంటి కూతురు.. శత్రువుకి కూడా పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా.. అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

New Update
Vijayasai Reddy : టీడీపీ, జనసేన వాటా ఇంతే: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Daggubati Purandeswari), వైసీపీ మంత్రుల మధ్య వార్ నడుస్తోంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రశ్నిస్తుంటే తనను టీడీపీ కోవర్టని ముద్ర వేస్తున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడుతున్నారు పురందేశ్వరి.

Also Read: ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా

మరోవైపు, పురందేశ్వరి బీజేపీ కన్నా ఎక్కువుగా టీడీపీకే సపోర్ట్ గా చేస్తున్నారంటూ వైసీపీ మంత్రులు వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో మరోసారి పురందేశ్వరిని టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy). ఎక్స్ వేదికగా స్పందిస్తూ కౌంటర్లు వేశారు.

ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి అని ప్రశ్నించారు. ఆ వయస్సులో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి..పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారని అన్నారు. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా ! అంటూ పోస్ట్ చేశారు.

Advertisment
తాజా కథనాలు