Vidadala Rajini: 'ఎంత రౌడీయిజం చేసిన భయపడేదే లేదు' మంత్రి విడుదల రజిని సీరియస్.!

టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి విడదల రజిని‌. మంచి వాతావరణం ఉన్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత రౌడీయిజం చేసిన భయపడేదే లేదని పేర్కొన్నారు.

Vidadala Rajini: 'ఎంత రౌడీయిజం చేసిన భయపడేదే లేదు' మంత్రి విడుదల రజిని సీరియస్.!
New Update

Vidadala Rajini: గుంటూరులో వెస్ట్ వైసీపీ కార్యాలయం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రి విడుదల రజిని, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని‌ తన కార్యాలయంపై దాడి జరిగిన ఘటనపై స్పందించారు. టిడిపి కార్యకర్తలు గుండాలు, రౌడిమూకలు అల్లకలోలం చేశారని మండిపడ్డారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంచి వాతావరణం ఉందని అయితే.. టీడీపీ వాళ్లు రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ‘ఇంకొకసారి నా జోలికి రావద్దు’..అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.!

టిడిపి వాళ్లకు ఓటమి భయం పట్టుకుందని.., అందుకే అల్లర్లు సృష్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. టీడీపీ ఎన్ని రౌడీయిజాలు చేసిన ఇలాంటి ఘటనలకు భయపడేదే లేదని తేల్చి చెబుతున్నారు. ప్రజల్లో టీడీపీ ఉనికి కోల్పోయిందని వ్యా్‌ఖ్యనించారు. క్రిమినల్ నేచర్ ఉన్న వ్యక్తులను ప్రజలను గుర్తుంచుకోవాలని వెల్లడించారు. ఇలాంటి రౌడీలకు అధికారం కట్టబెడితే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండని వ్యాఖ్యనించారు. గుంటూరు వెస్ట్ ను బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే మా ఉద్దేశమని చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ వెస్ట్ ను వరస్ట్ నియోజకవర్గంగా చేయాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

#health-minister-vidudala-rajini #andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe