V Hanumantha: ఆ పేరు చెప్పి వీహెచ్ ను బోల్తా కొట్టించాలనుకున్నాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

ఓ సైబర్ నేరగాడు హరిరామ జోగయ్య పేరిట కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కాల్ చేసి డబ్బు అడిగాడు. ఆపదలో ఉన్నానంటూ గూగుల్ పే ద్వారా డబ్బు పంపాలని వీహెచ్ ను రిక్వెస్ట్ చేశాడు.అయితే, ఫోన్‌ కాల్ పై అనుమానం వచ్చిన వీహెచ్‌.. హరిరామ జోగయ్య నివాసానికి ఓ వ్యక్తిని పంపి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. దీంతో తనకు వచ్చింది సైబర్ నేరగాడి కాల్ అని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
V Hanumantha: ఆ పేరు చెప్పి వీహెచ్ ను బోల్తా కొట్టించాలనుకున్నాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

V Hanumantha: ఓ సైబర్ నేరగాడు సీనియర్ రాజకీయవేత్త హరిరామ జోగయ్య పేరిట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ఫోన్ చేసి డబ్బు అడిగిన సంఘటన వైరల్ గా మారింది. ఓ వ్యక్తి  78010 96535‬ నంబర్ నుంచి హరిరామ జోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేశాడు.  తాను హరిరామ జోగయ్యను అంటూ వీహెచ్ కు కాల్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని, వెంటనే   96521 96535‬ నంబర్‌కు గూగుల్ పే ద్వారా డబ్బు పంపాలని కోరాడు.

అయితే, ఈ ఫోన్ కాల్ పై వీహెచ్ కు అనుమానం వచ్చింది. ఆయన ఓ వ్యక్తిని హరిరామ జోగయ్య నివాసానికి పంపి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. తనకు వచ్చింది సైబర్ మోసగాడి కాల్ అని తెలుసుకుని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, సైబరాబాద్ పోలీసులకు కూడా ఈ ఫోన్ కాల్ గురించి సమాచారం అందించారు. వీహెచ్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ ఫోన్ కాల్ ఖమ్మం నుంచి వచ్చినట్టు గుర్తించారు. సైబర్ నేరగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు  రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలను, సినీ యాక్టర్ల పేర్లను, అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. కంటికి కనిపించకుండా క్షణాల్లోనే డబ్బు స్వాహా చేసేస్తున్నారు. సైబర్‌ మోసాల బారిన పడినా, హ్యాకింగ్ లాంటివి జరిగినా ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ ఫ్రీకి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

Also Read: జగన్‌పై ఉన్న కేసులు ఎత్తివేస్తారా? పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisment
తాజా కథనాలు