Vangalapudi Anita: జగన్ ఏం చేశారో చెప్పాలి.. హోంమంత్రి అనిత ఫైర్!

పోలీసు శాఖకు జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు హోంమంత్రి అనిత. గత జగన్ ప్రభుత్వంలో, పోలీసు వాహనాలు కొని వాటికి డబ్బు కట్టనందుకు, మహీంద్రా కంపెనీ వాళ్ళు ఏపి పోలీసులను బ్లాక్ లిస్టులో పెట్టారని చెప్పారు. మేము వచ్చిన తరువాత, అవి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Vangalapudi Anita: జగన్ ఏం చేశారో చెప్పాలి.. హోంమంత్రి అనిత ఫైర్!
New Update

Vangalapudi Anita: గత ప్రభుత్వంపై అసెంబ్లీలో రెచ్చిపోయారు హోంమంత్రి అనిత. పోలీస్ శాఖకు సంబంధించిన నిధులు కూడా గత ప్రభుత్వం వేరే వాటికి మల్లించిందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు శాఖకు వాహనాల కొరత ఉందని అన్నారు. పోలీస్ శాఖలో 50% వాహనాల కొరత ఉందని లెక్కలు చెప్పారు. కొత్త వాహనాలకు సంబంధించి ప్రతిపాదన ప్రభుత్వానికీ పంపినట్లు తెలిపారు.

ఏపిఎస్పి నుంచి ఏఆర్ కి వెళ్లేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని.. రాష్ట్రంలో ఎలాంటి శాంతిభద్రతల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్ ప్లకార్డులతో శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారని.. జగన్ పోలీసుల భద్రత కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో, పోలీసు వాహనాలు కొని, వాటికి డబ్బు కట్టనందుకు, మహీంద్రా వాళ్ళు ఏపి పోలీసుని బ్లాక్ లిస్టులో పెట్టినట్లు చెప్పారు. మేము వచ్చిన తరువాత, అవి కట్టాల్సిన పరిస్థితి అని అన్నారు.

#home-minister-anita
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి