Good News For Telangana People : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనపై పట్టు సాధించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ క్రమంలోనే శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రులు అధికారులకు పలు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సివిల్ సప్లయ్ శాఖ పని తీరును సమీక్షించిన ఆయన.. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ, గిడ్డంగుల నిర్వహణ, రేషన్ వస్తువుల సరఫరా తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పూర్తిగా చదవండి..తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.500కే సిలిండర్ ఎప్పటినుంచంటే
తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్యాస్ సిలిండర్ హామీ వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈ రోజు నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు.
Translate this News: