TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?

టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహంగా ఉన్న బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. నేడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?

బీఆర్ఎస్ కు (BRS Party) షాక్ ఇచ్చేందుకు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. దీంతో పార్టీ హైకమాండ్ పై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Big Breaking: బీజేపీకి వివేక్ రాజీనామా.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక!

ఈ మేరకు ఇప్పటికే సుభాష్ రెడ్డి ఢిల్లీకి కూడా వెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సుభాష్‌ రెడ్డికి బీజేపీ ఉప్పల్ టికెట్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ లిస్ట్ లో సుభాష్‌ రెడ్డి పేరు ఉంటుందని బీజేపీ వర్గాల నుంచి సమాచారం.
ఇది కూడా చదవండి: ఒప్పిస్తా…మెప్పిస్తా..వాళ్ళిద్దరిని ఓడిస్తా…నేను గెలుస్తా.. కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణతో పాటు గ్రేటర్ రాజకీయాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఉప్పల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిపోయారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఎల్బీ నగర్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రామ్మోహన్ గౌడ్ కూడా తాజాగా మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు.

Advertisment
తాజా కథనాలు