Anand Mahindra: ఆనంద్‌ మహీంద్రా పై చీటింగ్‌ కేసు నమోదు!

సోషల్ మీడియాలో (Social Media) ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)తో పాటు మరో 12 మంది మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌ కు చెందిన ఉద్యోగుల పై చీటింగ్‌ కేసు(Cheating Case) నమోదు అయ్యింది.

New Update
Anand Mahindra: ఆనంద్‌ మహీంద్రా పై చీటింగ్‌ కేసు నమోదు!

సోషల్ మీడియాలో (Social Media) ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)తో పాటు మరో 12 మంది మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌ కు చెందిన ఉద్యోగుల పై చీటింగ్‌ కేసు(Cheating Case) నమోదు అయ్యింది.

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ లో కారు భద్రత పై మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీ తప్పుడు హామీలను ఇచ్చిందని ఓ వ్యక్తి ఆరోపిస్తున్నారు. యూపీకి చెందిన రాజేశ్‌ మిశ్రా అనే వ్యక్తి 2020 లో మహీంద్రా కంపెనీకి చెందిన బ్లాక్‌ స్కార్పియోను రూ.17.39 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. దానిని ఆయన అతని కుమారుడు అపూర్వ్‌ కు బహుమతిగా ఇచ్చాడు.

జనవరి 14, 2022 న అపూర్వ్‌ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్ కు వస్తున్న క్రమంలో పొగమంచు కారణంగా అపూర్వ్ నడుపుతున్న కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో అపూర్వ్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించాడు. అతని స్నేహితులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో రాజేశ్‌ మిశ్రా తాను కారు తీసుకున్న ఆటో స్టోర్‌ వద్దకు చేరుకుని కారులో ఉన్న లోపాలన్నింటిని కంపెనీ వారికి తెలియజేశాడు. ప్రమాదం జరిగిన సమయంలో అపూర్వ్‌ కారులోని సీట్ బెల్ట్‌ పెట్టుకునే ఉన్నాడు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ లు సరిగా తెరుచుకోకపోవడం వల్లే ప్రమాదంలో తన కొడుకు మరణించినట్లు రాజేశ్‌ మిశ్రా ఆరోపించారు.

కంపెనీ కారును అమ్మినప్పుడు అన్ని కూడా తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిందని రాజేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక కారును మార్కెట్ లోకి విడుదల చేసే ముందు నిశీతంగా పరిశీలించి ఉంటే కనుక ఈ ప్రమాదంలో తన కొడుకు మరణించి ఉండేవాడు కాదని ఆయన పేర్కొన్నారు.

మహీంద్రా సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. రాజేశ్ ఎక్కడైతే కారును కొనుగోలు చేశారో అక్కడికి ఆ ఆటోస్టోర్‌ వద్దకు వచ్చి గొడవకు దిగడంతో, సంస్థలో పని చేసే ఉద్యోగులు కూడా అతనితో పాటు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. సంస్థ డైరెక్టర్ల సూచనల మేరకు నిర్వాహకులు తనను , తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని రాజేశ్‌ ఆరోపించారు.

కారు ప్రమాదం జరిగిన తరువాత స్కార్పియోను రుమాలోని మహీంద్రా కంపెనీ షోరూమ్కు తరలించారు. కంపెనీ కారులో ఎయిర్‌ బ్యాగ్ లను ఏర్పాటు చేయలేదని రాజేశ్ ముందు నుంచి ఆరోపించారు. అందుకు గానూ మోసం చేసినందుకు గానూ సెక్షన్‌ 420, 287, 304-A మరి కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.

Advertisment
తాజా కథనాలు