Union Bank Manager: రూ. 5 కోట్లతో పరారైన యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్!

నిజామాబాద్‌‌‌‌ నగరంలోని శివాజీనగర్‌‌‌‌ యూనియన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లో అజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ సీనియర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్నాడు.మేనేజర్‌ పలువురు ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా 30 మందికి లోన్లు మంజూరు చేశాడు.బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ. 5 కోట్లతో మేనేజర్‌‌‌‌ పరార్‌‌‌‌ అయినట్లు సమాచారం.

Union Bank Manager: రూ. 5 కోట్లతో పరారైన యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్!
New Update

Union Bank: ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా, వారి పేరున లోన్లు మంజూరు చేసి వాటిని సైతం తన సొంతానికి వాడుకున్న ఓ బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ ఇప్పుడు మిస్సయ్యాడు. నిజామాబాద్‌‌‌‌ నగరంలోని శివాజీనగర్‌‌‌‌ యూనియన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లో అజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ అనే వ్యక్తి రెండేళ్లుగా సీనియర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే మేనేజర్‌ పలువురు ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా బిజినెస్‌‌‌‌, పర్సనల్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌‌‌, హౌసింగ్‌‌‌‌, ఓడీ తదితర పేర్లతో సుమారు 30 మందికి లోన్లు మంజూరు చేశాడు.

తర్వాత ఖాతాదారులకు నచ్చజెప్పి ఆ డబ్బులను తన సొంతానికి వాడుకునేవాడు. మధుసూదన్‌‌‌‌రావు అనే వ్యక్తి గతంలోనే హౌసింగ్‌‌‌‌, ముద్ర లోన్‌‌‌‌ తీసుకున్నప్పటికీ మరో లోన్‌‌‌‌ ఇస్తానంటూ రూ. 15 లక్షల లోన్‌‌‌‌ ఇప్పించాడు. తాను ఇల్లు కడుతున్నానని ఆ డబ్బులను తాను వాడుకుంటానని నమ్మించి డబ్బులు కాజేశాడు. అలాగే మరో ఇద్దరు వ్యాపారులకు బిజినెన్‌‌‌‌ లోన్‌‌‌‌ పేరుతో రూ.40 లక్షలు జారీ చేసి వారి వద్ద నుంచి బ్లాంక్‌‌‌‌ చెక్కులు తీసుకొని డబ్బులను డ్రా చేసుకొని సొంతానికి ఉపయోగించుకునేవాడు.

మేనేజర్‌‌‌‌ అజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ నాలుగు రోజుల నుంచి బ్యాంక్‌‌‌‌కు రాకపోవడం, సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌లో కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు బుధవారం 4వ టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు వచ్చి ఎస్సై పాండేరావుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం సుమారు రూ. 5 కోట్లతో మేనేజర్‌‌‌‌ పరార్‌‌‌‌ అయినట్లు సమాచారం.

Also read: అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాలో వానలే..వానలు!

#manager #cheating #union-bank
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe