ఉక్రెయిన్ పై రష్యా దాడులు ఆపాలి ఐక్యరాజ్యసమితి తీర్మానం! ఉక్రెయిన్పై రష్యా దాడిని ఆపాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చింది. దీనిపై ఓటింగ్కు ఆయాదేశాలు రావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. కానీ ఈ ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. అయితే తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 9 ఓట్లు వచ్చాయి. By Durga Rao 12 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో, ఉక్రెయిన్పై రష్యా తన దాడులను వెంటనే ఆపాలని, ఐవోరిజియా అణు విద్యుత్ ప్లాంట్తో సహా ఉపసంహరించుకోవాలని పిలుపునిస్తూ ఒక తీర్మానాన్ని తీసుకువచ్చింది. 193 మంది సభ్యులతో కూడిన UN దేశాలు అసెంబ్లీ తీర్మానంపై ఓటు వేసాయి. అయితే తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 9 ఓట్లు వచ్చాయి. రష్యా, ఉత్తర కొరియా, బెలారస్, క్యూబా,రష్యాతో సహా దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, పాకిస్థాన్, చైనా, ఈజిప్ట్, భూటాన్, నేపాల్, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకతో సహా 60 దేశాలు బహిష్కరించాయి. #united-nations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి