రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. మాస్కోలోని రెండు భవనాలను ఉక్రెయిన్ దళాలు గత రాత్రి లక్ష్యంగా చేసుకున్నాయి. ఆదివారం ఉదయం రెండు భవనాలపై డ్రోన్లు దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సైన్యం వాటిని కూల్చివేశాయి. అయితే ఈ దాడిలో ఇప్పటి వరకు ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. గత రాత్రి ఉక్రెయిన్ జరిపిన దాడిలో మాస్కోలోని రెండు భవనాలు దెబ్బతిన్నాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. ఈ దాడిలో రెండు కార్యాలయ టవర్లకు కొంత నష్టం వాటిల్లింది. దాడి నేపథ్యంలో మాస్కోలోని వ్నుకోవో విమానాశ్రయాన్ని మూసివేశారు. అలాగే ఇక్కడి నుంచి వెళ్లే విమానాలను దారి మళ్లించారు.
పూర్తిగా చదవండి..జెలెన్స్కీ దెబ్బకు పుతిన్కు మైండ్ బ్లాక్..మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు..!!
రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ దాడి కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం డ్రోన్లు మాస్కోలోని రెండు భవనాలపై దాడులు చేశారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం వాటిని కూల్చివేసాయి.
Translate this News: