Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళనకు దిగారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన చేపట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన
New Update

Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో సరైన వసతులు కల్పించాలని నినాదాలు చేపట్టారు. క్యాంపస్‌ నుంచి అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్ వరకు 2 వేల మంది విద్యార్థుల భారీ ర్యాలీ చేశారు. రెగ్యులర్ వీసీ కావాలంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. 17 డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని లేకపోతే ఆందోళనను తీవ్ర తరం చేస్తాం TSAS సంఘం నేతలు స్పష్టం చేశారు.

#basara-iiit
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe