శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సేవ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఆన్ లైన్ విధానం ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ధర్మారెడ్డి సమాధానం ఇచ్చారు. శ్రీవారి సేవ అనేది ఆన్ లైన్ ద్వారా మాత్రమే కేటాయిస్తారని.. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే భక్తులు నమ్మవద్దని సూచించారు. సేవ సాఫ్ట్ వేర్ ఖచ్చితంగా ఉంటుందని.. దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని ధర్మారెడ్డి తెలిపారు.
పూర్తిగా చదవండి..‘శ్రీవారి సేవ’ ఉచితం.. ఎవరికీ డబ్బులు ఇవ్వకండి: టీటీడీ ఈవో
ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే భక్తులు నమ్మవద్దని సూచించారు. సేవ సాఫ్ట్ వేర్ ఖచ్చితంగా ఉంటుందని.. దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా 'అమ్మ' అని పిలవాలన్నారు. సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్, లక్కీ డిప్ విధానం, తిరుమల సీఆర్వో వద్ద ఒకరోజు ముందుగా పేర్లను నమోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించబడుతుందని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఆన్ లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, ఎస్ ఎస్ డి టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు తిరుపతిలో కేటాయిస్తున్నామని..
Translate this News: