TTD Key Decision: టీటీడీ కీలక నిర్ణయం.. నడకమార్గంలో వాటికి నో పర్మిషన్!!
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇటీవల జరిగిన క్రూర మృగాల దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపాయి. ఈ క్రమంలో టీడీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖల అధికారులతో సహా దుకాణదారుల నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చారు. తిరుమల నడక దారుల్లో క్రూర మృగాల కదలికలు ఉన్న నేపథ్యంలో భక్తులు భద్రత దృష్ట్యా.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి దుకాణదారులకు పలు సూచనలు చేశారు. అలిపిరి నడక మార్గంలో దాదాపు వందకు పైగా తినుబండారాలను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించరాదని సూచించారు.