బాలుడిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుపతి నడక మార్గంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు ప్రత్యేక సూచనలు చేస్తోంది. మెట్ల మార్గంలో నడిచి వెళ్తున్న భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని మైక్‌ల ద్వారా విజిలెన్స్ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

New Update
బాలుడిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

TTD EO inspected the area where the boy was attacked<br />

బాలుడిపై చిరుత దాడి

తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి ప్రత్యక్షమైంది. ఏడవ మైలు దగ్గర చిరుత బాలుడిపై దాడి చేసి, అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. వెంటనే గమనించిన బాలుడి తాత, భక్తులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంబడించారు. ఇంతలో తిరుపతి ఎస్సై అటువైపుగా వెళుతూ ఘటనా స్థలానికి పరుగులు తీశారు. చిరుత అటవీ ప్రాంతంలో దాదాపు 150 మీటర్ల దూరంలో బాలుడిని వదిలి వెళ్లింది. బాలుడిని వెంటనే బయటకు తీసుకొచ్చి టీటీడీ విజిలెన్స్,‌ పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు.

కౌశిక్‌ను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్

తిరుమల అలిపిరి నడకదారిలో చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి కౌశిక్‌కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. బాలునిపై చిరుత దాడి చేసిన స్పాట్‌ను విజిట్ చేశారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న కౌశిక్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్లనే చిరుత పులి బారి నుంచి ప్రాణాలతో బాలుడు బయటపడ్డాడు అన్నారు.. కౌశిక్ మెల్లిగా కోలుకుంటున్నారన్నారు.

తీవ్రంగా గాయాలతో ఆస్పత్రిలో బాలుడు

చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలియడంతో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి సంఘటనా స్ధలంకు చేరుకుని బాలుడిని హుటాహుటిన 108 వాహనంలో తిరుపతిలోని చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. ఆదోనికి చెందిన బాలుడి కుటుంబం అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా ఏడో మైలు దగ్గర స్నాక్స్ తీసుకుంటున్నారు. ఆ సమయంలో బాలుడిని చిరుత దాడి చేసింది.

ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు

అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గం తరహాలో రాత్రి 6 గంటలు తర్వాత నడక అనుమతి నిలిపి వేసే విధంగా ఆలోచన చేస్తున్నామన్నారు. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. మెట్ల మార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. చిన్నారి కౌశిక్ ఆరోగ్యం మెరుగైన తర్వాత స్వామి వారి దర్శనం కుటుంబానికి చేయిస్తామని.. స్వగ్రామం ఆదోని తీసుకు వెళ్లి దించుతామన్నారు.

బాలుడికి పునఃజన్మ

బాలుడికి ఇది నిజంగా పునఃజన్మ అన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో బాలుడు క్షేమం ఆస్పత్రి నుండి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందన్నారు. బాలుడి‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామని.. ఇక రెండు నడక మార్గాల్లో మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. అటవీ ప్రాంతంలో జంతువుల సంచారంకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రెండు నడక మార్గంలో అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. నడక మార్గంలో భక్తుల అనుమతించడంపైనా చర్చించి నిర్ణయం తీసకుంటామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు