Sajjanar: త్వరలో డ్రైవర్లు, కండక్టర్ల భర్తీ.. సజ్జనార్ కీలక ప్రకటన

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2375 బస్సులను విడతల వారీగా అందుబాటులోకి తేనున్నామని, అలాగే వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్‌ను చేపడుతామని పేర్కొన్నారు.

Hyderabad : హైదరాబాద్ వాసులకు TGRTC అదిరిపోయే శుభవార్త!
New Update

TSRTC MD Sajjanar: హైదరాబాద్‌లోని టీఎస్‌ఆర్టీసీ కేంద్ర కార్యాలయం బస్‌ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2375 బస్సులను విడతల వారీగా అందుబాటులోకి తేనున్నామని, అలాగే వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ను చేపడుతామని పేర్కొన్నారు.

ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు

ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. దేశానికే గర్వకారణమైన జనగణమన జాతీయ గీత ప్రాముఖ్యతను భవిష్యత్‌ తరాలకు వివరించడంతో పాటు నేటి తరంలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు బస్ భవన్ లో జాతీయ గీతలాపన చేస్తున్నామని చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ మహోత్తర కార్యక్రమాన్ని జోన్, ఆర్ఎం కార్యాలయాలతో పాటు డిపోలకు విస్తరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు.

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లో సమర్థవంతంగా సంస్థ అమలు చేసిందని గుర్తు చేశారు. సంస్థకు చెందిన 7200 పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహాలక్ష్మి స్కీం విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పడానికి తనకెంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని, ఈ స్కీమ్ ను ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్దతతో పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైతుందన్నారు.

మహాలక్ష్మి స్కీమును ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా అమలుచేస్తున్నారని సంస్థ అధికారులను, సిబ్బందిని ప్రభుత్వం మెచ్చుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలియజేశారన్నారు.

“పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే 1325 డీజిల్, మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తోంది. ఈ 2375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోంది. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్ మెంట్ ను చేపడుతాం. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఆదివారం కరీంనగర్ లో వారికి అపాయిట్మెంట్ లెటర్లను అందజేస్తారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారు.” అని సజ్జనార్ తెలిపారు.

టీఎస్ఆర్టీసీ సిబ్బంది పెండింగ్ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.

టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ ఛాలెంజ్ ను తీసుకువచ్చిన అధికారులు, సిబ్బంది విజయవంతం చేస్తున్నారని, ఛాలెంజ్ కు తగ్గట్టుగా పనిచేస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా సంక్రాంతికి సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేశారని, ఇన్సిడెంట్ ఫ్రీగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, అదే స్పూర్తితో, ఉత్సాహంతో రాబోయే మేడారం జాతరకు పనిచేయాలన్నారు.

DO WATCH:

#bus-drivers-recruitment #tsrtc-md-sajjanar #telangana-latest-news #free-bus-scheme #conductors-recruitment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe