Bhadradri : శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా భద్రాచలం(Bhadrachalam) లో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాల(Talambras) ను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది. హైదరాబాద్లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్ను ఆయన ప్రారంభించారు.
ఇది కూడా చదవండి : TS Dsc: తెలంగాణ డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుంచో తెలుసా?
TSRTC : రూ.151 చెల్లిస్తే ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు.. ఇలా బుక్ చేసుకోండి!
భక్తుల ఇంటికే భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను అందించే ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ఆర్టీసీ. ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Translate this News: