TS RTC: ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీకి కాసుల పంట..ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా!

లోక్‌ సభ ఎన్నికలు తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి.ఎన్నికల సమయంలో 3500 పై చిలుకు బస్సులను నడిపింది.ఈ నెల 13న తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ జరిగింది.టీఎస్ఆర్టీసీల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. దీంతో సంస్థకు రూ.24.22 కోట్ల ఆదాయం వచ్చింది.

New Update
TS RTC: ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీకి కాసుల పంట..ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా!

Ts Rtc: లోక్‌ సభ ఎన్నికలు తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి. ఎలక్షన్స్ టైమ్ లో తెలంగాణ ఆర్టీసీ 3500 పై చిలుకు బస్సులను స్పెషల్‌ గా నడిపింది. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, జేబీఎస్‌, ఎంజీబీఎస్, కూకట్‌పల్లి, మియాపూర్‌ వంటి ప్రాంతాల నుంచి టీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడిపింది.

దీంతో ఆ ఒక్కరోజు టీఎస్ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది. ఈ నెల 13న తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ జరిగింది. ఆ రోజు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. దీంతో సంస్థకు రూ.24.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్నికల మరుసటిరోజున 54 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. టిక్కెట్ కొనుగోలు చేసినవారి ద్వారా రూ.15 కోట్ల ఆదాయం సమకూరింది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో రూ.9 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం... టీఎస్ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది.

Also read: అరేయ్‌ ఏంట్రా ఇది.. జర చూసుకోవాలి కదా!

Advertisment
తాజా కథనాలు