TSRTC: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఆ రూట్లో ఎల్లుండి నుంచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు!

ఈ నెల 15 నుంచి పటాన్ చెరు-సికింద్రాబాద్ రూట్లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

New Update
TSRTC: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఆ రూట్లో ఎల్లుండి నుంచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు!

TSRTC Electric AC Buses: సరికొత్త నిర్ణయాలు, మార్పులతో ఆర్టీసీని (TSRTC) ప్రజలకు చేరువ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (MD Sajjanar). తాజాగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్-పటాన్ చెరు మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను ఈ నెల 15వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana: ‘దటీజ్ కేసీఆర్’.. ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఎంపీ సంతోష్..

ఈ రూట్ లో ప్రతీ 24 నిమిషాలకు ఓ ఏసీ మెట్రో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. 219 రూట్ నెంబర్ గల ఈ బస్సులు.. పారడైస్, బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి మీదుగా పటాన్ చెరు చేరుకుంటాయని వివరించారు. తిరిగి అదే మార్గంలో సికింద్రాబాద్ కు చేరుకుంటాయన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సజ్జనార్.

Advertisment
తాజా కథనాలు