TSPSC Exams: పోటీ పరీక్షల విషయమై విద్యార్థుల్లో తీవ్రమైన సందిగ్ధం నెలకొంది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా వేలసంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లు ముందుకు సాగలేదు. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, పరీక్షలు వాయిదా పడడం వంటి పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి. దానికి ముందు పేపర్ లీకేజీలతో పరీక్షల రద్దు, ఇంకొన్ని పరీక్షల వాయిదాలతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటివరకూ గ్రూప్ 4 (TSPSC Group 4), గురుకుల, పోలీసు పరీక్షలు మినహా ఇతర నియామక పరీక్షలేవీ సజావుగా ముందుకు సాగలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ నిరుద్యోగుల సమస్యలకు పెద్దపీట వేయడంతో పాటు తేదీలతో సహా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి వారిని ఆకట్టుకుంది. తాజాగా “కొత్త ప్రభుత్వం స్థిరపడిన తర్వాత పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? అవే నోటిఫికేషన్లను కొనసాగిస్తారా? లేదంటే వాటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు ప్రకటిస్తారా? టీఎస్పీస్సీ (TSPSC) బోర్డు ప్రక్షాళన ఎప్పుడు?” వంటి ప్రశ్నలతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత సతమతమవుతున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే గ్రూప్-2 పరీక్షలకు సెంటర్లను సిద్ధం చేస్తూ టీఎస్పీఎస్సీ సోమవారం ప్రకటన వెలువరించడం తీవ్రంగా చర్చనీయమవుతోంది.
పూర్తిగా చదవండి..TSPSC Exams: పరీక్షల సంగతేంటి!.. అభ్యర్థుల్లో సందిగ్ధం
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతలో గందరగోళం నెలకొంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారా లేదంటే ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లు కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Translate this News: