TS Police Jobs: కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయండి.. సీఎంను కలిసిన నల్గొండ ఎమ్మెల్యేలు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలని సీఎంను వారు కోరారు.

New Update
TS Police Jobs: కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయండి.. సీఎంను కలిసిన నల్గొండ ఎమ్మెల్యేలు
పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెం.46పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. జీవో నుంచి కోడ్ నెం.24 TSSP (5000) మినహాయించాలని వారు కోరారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు స్థానిక నిరుద్యోగుల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. CD1, CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: CWC Meeting: ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు..
తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలన్నారు. చాలా జిల్లాల్లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జై వీర్ రెడ్డి, పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, మందుల సామ్యూల్, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి గతంలో అభ్యర్థులు ఆందోళనలు చేశారు. జీవో నంబర్.46తో తాము నష్టపోయామని ముఖ్యంగా నల్గొండ జిల్లా అభ్యర్థులు ఆందోళనలు చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆందోళన నెలకొంది.
Advertisment
తాజా కథనాలు