పూర్తిగా చదవండి..
Falaknuma express howrah to secunderabad train mein Aag lag Gaya hai maula Ali ke pass.. train no..12703 pic.twitter.com/EFwFrUFwqD
— Mustaque (@Mustaqu76148419) July 7, 2023
మరో రైలు ప్రమాదం
తెలంగాణలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా వద్ద ఫలక్ నుమా ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. దీనితో రైలును పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య రైలును నిలిపివేశారు. ఈ ప్రమాదంలో మూడు రైలు బోగీలు దగ్ధం అయ్యాయి. అయితే ప్రయాణికులు అప్రమత్తమై రైలు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ధాటికి పెద్ద ఎత్తున పొగలు వ్యాపిస్తున్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్కు ఈ రైలు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
వరస ప్రమాదాలు ..
యావత్ దేశాన్ని షాక్కు గురిచేసిన ఒడిశా రైలు ప్రమాదం ఘటన జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరు- హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు.. బాలాసోర్లోని బహనాగా బజార్ స్టేషన్కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. ప్యాసింజర్ రైళ్లల్లో సుమారు 2500 మంది ప్రయాణికులు ఉండగా.. 288మంది ప్రాణాలు కోల్పోయారు. 1000కిపైగా మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అశ్విని వైష్ణవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు అనేక మంది నేతలు ఘటనాస్థలాన్ని పరిశీలించి తెలిసిందే. మృతుల కుటుంబసభ్యులను, క్షతగాత్రులను పరామర్శించారు. అప్పటి నుంచి ఏలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు దక్షణ మధ్య రైల్వే చర్యలు తీసుకున్నపట్టికి ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి.
[vuukle]