ఇక పై కాల్, డేటా, SMS సేవల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు!

కాల్, డేటా, SMS సేవల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను రూపొందించాలని టెలికాం కంపెనీలకు TRAI ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది నాన్-స్మార్ట్‌ఫోన్ సబ్‌స్క్రైబర్‌లు తాము ఉపయోగించని డేటా సేవలకు కూడా ఛార్జీ విధిస్తున్నట్టు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ట్రాయ్ ఈ చర్యలు తీసుకోనుంది.

New Update
ఇక పై కాల్, డేటా, SMS సేవల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు!

కాల్, డేటా, SMS సేవల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను రూపొందించాలని టెలికాం కంపెనీలకు సెంట్రల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) సిఫార్సు చేసింది. భారతదేశంలో దాదాపు 112 కోట్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 65.90 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. చాలా మంది  నాన్-స్మార్ట్‌ఫోన్ సబ్‌స్క్రైబర్‌లు తాము ఉపయోగించని డేటా సేవలకు కూడా ఛార్జీ విధించబడుతున్నారని ఫిర్యాదు చేశారు.

దీనికి సంబంధించి, TRAI జారీ చేసిన సలహా ఇలా పేర్కొంది:

ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు, కాలింగ్, డేటా, SMS సేవల కోసం ప్రత్యేక  ఇంటిగ్రేటెడ్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకురావడం అవసరం.ప్రస్తుతం వాడుకలో ఉన్న రీఛార్జ్ ప్లాన్‌లు సరైన చెల్లింపు ప్లాన్‌ను ఎంచుకోవడంలో తమకు ఆటంకం కలిగిస్తున్నాయని సబ్‌స్క్రైబర్‌లు భావిస్తున్నారు. అలాగే, ప్రత్యేక టారిఫ్ ప్లాన్‌లు, 'కాంబో రీఛార్జ్' ప్లాన్‌ల చెల్లుబాటు వ్యవధిని ప్రస్తుతమున్న 90 రోజుల నుండి పెంచాలి. మార్పులు అవసరం లేదని భావించే వారు ఆగస్టు 23లోగా తమ అభిప్రాయాలను ట్రాయ్ వెబ్‌సైట్‌కు పంపవచ్చు. చాలా మంది ల్యాండ్‌లైన్ చందాదారులు వారు ఉపయోగించని డేటా సేవలకు కూడా చెల్లిస్తున్నట్టు వాపోతున్నారు.