Basar iiit: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం...ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్..!!

బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ మొదటిసంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి అనుబంధంగాఉన్న హాస్టల్ నాలుగో అంతస్తులో ప్రవీణ్ కుమార్ సుసైడ్ కు పాల్పడ్డాడు.

Basar iiit: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం...ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్..!!
New Update

బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ మొదటిసంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి అనుబంధంగాఉన్న హాస్టల్ నాలుగో అంతస్తులో ప్రవీణ్ కుమార్ సుసైడ్ కు పాల్పడ్డాడు. ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా. మృతదేహన్ని పోస్టు మార్టం కోసం భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గతంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టునెలలో బబ్లూ అనే స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన బబ్లూ వ్యక్తిగత కారణాలతోసూసైడ్ చేసుకున్నాడని ప్రకటించారు. ఈ ఏడాది జూన్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యచేసుకున్నారు. జూన్ 13న ఐటీ విద్యార్థి దీపిక సూసైడ్ చేసుకుంది. అదే నెల 15వ తేదీన లిఖితే అనే విద్యార్థి మరణించింది. ఈ ఇద్దరి మరణంపై గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అప్పట్లో సర్కార్ నుంచి నివేదికను కోరింది.

ఇది కూడా చదవండి: న్యూమోనియా కేసుల విజృంభణ..అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు..!!

#basar-iiit #ramati-praveen-kumar #rajiv-gandhi-university-of-knowledge-technologies-basar #suicide #basar-iiit-college
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe