TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 30 గంటల సమయం

New Update
TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 30 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం కొలువైవున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండి శిలా తోరణం వరకు బారులు తీరారు. దీంతో స్వామివారి సర్వ దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తడంతో సర్వ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు వెల్లడించారు. చిన్న పిల్లలు ఉన్న వారు ఆదివారం ఉదయం స్వామి వారి దర్శనానికి రావాలని సూచిస్తున్నారు.

మరోవైపు రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలిపిన టీటీడీ.. ఉచిత దర్శన టికెట్లు ఆక్టోబర్ 1, 7, 8, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. గత కొన్నిరోజులు వరుసగా సెలవులు రావడంతో తిరుమల కొండపై రద్దీ పెరిగిందని టీటీడీ తెలిపింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తలు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని సూచించింది.

మరోవైపు తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ద్విచక్ర వాహనాలను ఘాట్‌ రోడ్డులో అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. గతంలోలా యథావిధిగా రాత్రి 10 గంటల వరకూ ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వన్య మృగాల కదలికలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. కాగా గతంలో చిరుత పులులు అర్థరాత్రి సమయంలో కాలి నడకన కొండపైకి వస్తున్న భక్తులపై దాడికి దిగాయి.

అదే సమయంలో ద్యిచక్ర వాహనాలపై వస్తున్న భక్తులపై సైతం దాడికి దిగబోయాయి. దీంతో సాయంత్రం సమయంలో ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనమతి ఇవ్వడంలేదని టీటీడీ తెలిపింది. ఇక భక్తులపై దాడి చేస్తున్న వన్య మృగాలను పట్టుకునేందుకు ఆపరేషన్ చిరుతను ప్రారంభించిన టీటీడీ.. ఇప్పటి వరకు 6 చిరుతలను బంధించింది. దీంతో చిరుతల కదలికలు కొండ పరిసర ప్రాంతాల్లో తగ్గాయని గుర్తించిన టీటీడీ అధికారులు.. యథావిధిగా బైక్‌లను అనుమతిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

Advertisment
తాజా కథనాలు