యువకుని పై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు!

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ముగ్గురు యువకులు అల్తాఫ్‌ (19) అనే యువకుని పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

New Update
యువకుని పై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు!

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ముగ్గురు యువకులు అల్తాఫ్‌ (19) అనే యువకుని పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

సోమవారం ఉదయం అల్తాఫ్‌ ఇంటి నుంచి బయటకు వస్తుండగా కొందరు యువకులు వచ్చి పల్సర్‌ బైక్‌ పై వచ్చి అల్తాఫ్‌ ని అడ్డుకున్నారు.
బలవంతంగా బండి మీద ఎక్కించుకొని పట్టణ సమీపంలోని నవోదయ పాఠశాల సమీప ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ చూస్తుండగా పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు.

స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు తప్పించుకుని పారిపోయారు. నిప్పు పెట్టిన యువకుడి ఒంటికి అంటుకున్న మంటలను అదుపు చేసిటప్పటికే బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

బాధితుడిని 108 సిబ్బంది హుటాహుటిన మదన పల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆల్తాఫ్‌ను డీఎస్పీ పరామర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు