Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు వెల్లడించారు.

New Update

Kakinada Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యానాం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పల్సర్ బైక్ పై వెళ్తున్న నలుగురు యువకులు ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టారు. వేగంగా వెనుక నుంచి ట్రాక్టర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు తాళ్లరేవు మండలం రచ్చ వారి పేట కు చెందిన ఓలేటి శ్రీను (28), ఓలేటి రాజు(26), ఎదుర్లంక గ్రామం రామాలయం పేటకు చెందిన పాలేపు ప్రసాద్(24) గా గుర్తించారు. తీవ్ర గాయాలు పాలైన రచ్చ శ్రీనును ఆసుపత్రికి తరలించిన పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

#kakinada-news #ap-news #accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe