AP: ఒంటిమిట్ట లో విషాదం..ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య! ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లికూతుర్లు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే .. ఇంటి యజమాని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. By Bhavana 23 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Family Suicide in Vontimitta: ఏపీ వైఎస్సాఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లికూతుర్లు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే .. ఇంటి యజమాని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సుబ్బారావు మూడెకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు. రెవిన్యూ అధికారులు ఆన్లైన్ చేసే విషయంలో వేధింపులకు గురి చేస్తున్నారని సుబ్బారావు, భార్య పద్మావతి, కూతురు వినయకి చెప్పి చాలా సందర్భాల్లో బాధపడేవాడు.పొలం శ్రావణి పేరుతో రికార్డుల్లో ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారని చెప్పాడు. పొలం తమ పేరుతో రికార్డుల్లో లేకపోవడంతో కుటుంబం మనస్థాపంచెందిన కుటుంబం.. రెవిన్యూ అధికారులు మోసం చేశారంటూ సూసైడ్ నోట్లో వెల్లడించారు. లంచం తీసుకొని భూమి ఆన్లైన్ చేయకపోవడంతో మనస్థాపం చెంది బలవన్మరణం చెందినట్లు అధికారులు గుర్తించారు. ఇంట్లో భార్య పద్మావతి, కుమార్తె వినయ ఉరేసుకుని మరణించగా, సుబ్బారావు రైలు కింద పడి చనిపోయాడు. అధికారులు వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని లెటర్ రాసి మరీ చనిపోయిన ముగ్గురు. Also read: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు… రిటైర్డ్ ఐపీఎస్ తో పాటు, ఓ మీడియా ఛానెల్ అధినేత కూడా! #kadapa #suicide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి