Viral Video : మామిడి కాయల కోసం వెళ్లిన చిన్నారులపై తోటమాలి దారుణ చర్య!

యూపీలోని పిపారియా గురుగోవింద్‌ రాయ్‌ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. మామిడి కాయల కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులపై తోటమాలి దారుణ చర్యకు పాల్పడ్డాడు. తాడుతో ముగ్గురు పిల్లలను చెట్టుకు కట్టేసి విపరీతంగా కొట్టాడు

New Update
Viral Video : మామిడి కాయల కోసం వెళ్లిన చిన్నారులపై తోటమాలి దారుణ చర్య!

Uttar Pradesh : యూపీలోని పిపారియా గురుగోవింద్‌ రాయ్‌ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. మామిడి కాయల (Mangos) కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులపై తోటమాలి దారుణ చర్యకు పాల్పడ్డాడు. తాడుతో ముగ్గురు పిల్లలను చెట్టుకు కట్టేసి విపరీతంగా కొట్టాడు. అయితే అక్కడే ఉన్న కొందరు ఈ దారుణ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియా (Social Media) లో పెట్టడంతో వైరల్ గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఉదయం వాకింగ్‌ కి వెళ్లిన సమయంలో ఓ మామిడి తోటలోని మామిడి కాయలను కోయడంతో అక్కడే ఉన్న తోటమాలి ఆగ్రహం వ్యక్తం చేసి.. వారిని తాడుతో కట్టేసి..నోట్లో మామిడి కాయలు పెట్టి మరీ విపరీతంగా కొట్టాడు. ఈ ఘటన ఉదయం 10 గంటల సమయంలో జరిగింది.

సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో తోటమాలి (Gardener) పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్నాడన్న సమాచారం గ్రామస్తులకు తెలిసి అక్కడ గుమిగూడారు. అక్కడే ఉన్న ఒకరు ఈ ఘటనను వీడియో తీశారు.

విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్లారు. తోటమాలి సహా ముగ్గురు వ్యక్తులు పిల్లలను కట్టేసి కొట్టారని ఓ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. చౌక్ పోలీస్ స్టేషన్‌లో తోటమాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను బంధించి చిత్రహింసలు పెట్టినందుకు మామిడి తోట యజమాని సుదర్శన్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ హెడ్ ప్రశాంత్ కుమార్ పాఠక్ తెలిపారు.

.Also read: ఆర్టీసీ బస్సు బోల్తా…20 మంది ప్రయాణికులు!

Advertisment
తాజా కథనాలు