Movies : ఈ వారం థియేటర్స్ లో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు..!

సినీ ప్రియులను అలరించేందుకు ఈ వారం అదిరిపోయే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. విజయ్ 'ఫ్యామిలీ స్టార్', సూర్య తేజ హీరోగా పరిచయమవుతున్న 'భరత నాట్యం', సస్పెన్స్ థ్రిల్లర్ 'బహుముఖం'. వీటితో పాటు మలయాళ హిట్ ఫిల్మ్ 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగులో విడుదలకు సిద్ధమైంది.

New Update
Movies : ఈ వారం థియేటర్స్ లో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు..!

This Week Theatre & OTT Releasing Movies : ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్న సినిమా(Cinemas) లేంటో ఇప్పుడు తెలుసుకుందాము.

బహుముఖం

హర్‌శివ్ కార్తీక్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం 'బహుముఖం'(Bahumukham). స్వర్ణిమా సింగ్ , మరియా మార్టినోవా ప్రధాన పాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 6న థియేటర్స్ లో విడుదల కానుంది.

Bahumukham

మంజుమ్మల్ బాయ్స్

రీసెంట్ గా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల లిస్ట్ లో స్థానం దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ నిలిచినా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్ టైమెంట్స్ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Manjummel Boys

ఫ్యామిలీ స్టార్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్(Family Star). విజయ్ హీరోగా గీతగోవిందం మూవీతో హిట్ కొట్టిన పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ హిట్ కాంబో మరో సారి రిపీట్ కావడం సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మించారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 9న విడుదల కానుంది.

Family Star

ప్రాజెక్ట్ - Z

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం మాయవన్. ఏడేళ్ల కిందట తమిళ్ లో విడుదలైన ఈ చిత్రాన్ని.. ఇప్పుడు ప్రాజెక్ట్ - Z పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని సీవీ కుమార్ తెరకెక్కించారు. ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Project Z

భరత నాట్యం

కె వి ఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'భరత నాట్యం'(Bharata Natyam). నటుడు సూర్య తేజ ఏలే ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటించగా.. హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ గోష్, మస్తలి(సలీమ్ ఫేకు), టెంపర్ వంశీ, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా నేపథ్యంలో సాగే ఈ కథ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. Pr ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ ఈ సినిమాను నిర్మించారు.

Bharata Natyam

Also Read : Paarijatha Parvam Movie : తిరుమలలో ‘పారిజాత పర్వం’ మూవీ టీమ్.. వైరలవుతున్న ఫొటోలు

Advertisment
తాజా కథనాలు