PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే..! త్వరలోనే లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈనెల 15,16,18తేదీల్లో తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు. By Bhoomi 12 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి PM Modi : లోకసభ ఎన్నికల(Lok Sabha Elections) సమయం దగ్గరపడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోటా పోటీగా నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ(Telangana) లో మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) పర్యటించనున్నారు. ఎన్నిల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఇప్పటికే ఒక దఫా తెలంగాణలో పర్యటించారు మోదీ. ఇప్పుడు ఈ నెల 15,16,18తేదీల్లో మరోసారి రాష్ట్రానికి రానున్నారు. 15వ తేదీన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు గంటన్నరకు పైగా రోడ్ షో(Road Show) నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. హొం మంత్రి అమిత్ షా(Amit Shah) తో సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మోదీ రోడ్ షో గురించి చర్చించారు. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో మరోసారి మల్కాజిగిరి రోడ్ షో గురించి సన్నాహాక సమావేశం జరుగుతుందని బీజేపీ తెలిపింది. 16న నాగర్ కర్నూల్ , 18న జగిత్యాలలో మోదీ ఎన్నికల సభల్లో పాల్గొనున్నారు. ఇది కూడా చదవండి : కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన హనుమాన్ మూవీ టీం.! #telangana-tour #pm-modi #pm-narendra-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి