పోలీసులు బూతులు తిట్టారని స్టేషన్ లోనే యువకుడి దారుణం.. ఏం చేశాడంటే

ఏ తప్పు చేయకుండానే పోలీసులు అదుపులోకి తీసుకుని అన్యాయంగా కొట్టారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా యర్రగొంపాలెంలో చోటుచేసుకుంది. అదే పోలీస్టేషన్ లో మోజేష్‌ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

పోలీసులు బూతులు తిట్టారని స్టేషన్ లోనే యువకుడి దారుణం.. ఏం చేశాడంటే
New Update

స్నేహితుల మధ్య చిన్న గొడవ ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఒకే కాలేజీలో చదువుతున్న యువకులంతా ఓ విషయంలో గొడవపడుతుండగా అటువైపుగా వచ్చిన పోలీసులు ఒక అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, గొడవతో తనకు సంబంధం లేదని చెప్పిన వినకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చితకబాదారు. అంతేకాదు తన పేరెంట్స్ ను పోలీసులు దుర్భాషలాడంతో మనస్తాపానికి గురైన యువకుడు అదే పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఈ మేరకు ప్రకాశం మార్కాపురం పోలీసులు, బాధితుడు, కుటుంబసభ్యులు తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యర్రగొండపాలెంలోని గాయత్రి సినిమాహాలు సమీపంలో నాగెపోగు నరసింహారావు కుటుంబం నివాసముంటోంది. వారి కుమారుడు మోజేష్‌ (19) దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం మాచర్ల రోడ్డులోని రాళ్లవాగు వంతెన పక్కన కొందరు యువకులు గొడవ పడ్డారు. పోలీసులు వెళ్లి, ఆ సమయంలో అక్కడున్న మోజేష్‌, సుభాని అనే యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. మోజేష్‌ తండ్రిని పిలిచి ఇష్టమొచ్చినట్లు దూషించారు. అదేరోజు రాత్రి వారిని ఇంటికి పంపించిన పోలీసులు బుధవారం మళ్లీ రమ్మని చెప్పారు. బుధవారం ఉదయం సైతం కొట్టి, తన తండ్రిని ఎస్సై, సీఐ ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి :కాంగ్రెస్‌ 6 గ్యారంటీల అమలు.. ఏటా ఎన్ని కోట్లు కావాలంటే!

అయితే ఈ క్రమలోనే మోజేష్‌ తీవ్ర మనస్తాపానికి గురై పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే బుధవారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో కేకలు వేస్తూ స్టేషన్‌ నుంచి బయటకొచ్చి ఎదురు వీధిలోని నీళ్ల డ్రమ్ములో పడ్డాడు. ఎస్సై రాజేష్‌, సిబ్బంది హుటాహుటిన అతణ్ని మార్కాపురం వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. అయితే ఈ సంఘటనలో మోజేష్‌ శరీరం దాదాపు 50 శాతం కాలిపోయినట్లు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు వెల్లడించగా.. అక్కడ్నుంచి మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెడికో లీగల్‌ కేసు పెట్టకుండా వైద్యం చేయలేమని చెప్పడంతో బాధిత కుటుంబసభ్యులతో రాజీకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అకారణంగా తమ బిడ్డను పోలీసులు కొట్టడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్‌ ముందు రోడ్డుపై నిరసన చేపట్టారు. తమ బిడ్డకు న్యాయం జరిగేంతవరకూ ఊరుకునేది లేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.

#prakasham #mojesh #suicide #police-station
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe