crime News: మాంసం కోసం కొట్టుకున్న ఇరు వర్గాలు..పది మందికి తీవ్రగాయాలు..!

కర్నూలు జిల్లా జూపాడు మండలం మడ్లేం గ్రామంలో ఉగాది సందర్భంగా కర్రెమ్మ అమ్మవారికి పోతును బలి ఇచ్చారు గ్రామస్థులు. అనంతరం మాంసం పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Murder: ఏపీలో భయంకరమైన మర్డర్.. గాజు సీసాతో అది కోసి!
New Update

కర్నూలు జిల్లా జూపాడు మండలం మడ్లేం గ్రామంలో ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి.  మాంసం కోసం ఇరువర్గాల ఘర్షణపడ్డాయి. ఈ ఘటనలో 10మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగాది సందర్భంగా కర్రెమ్మ అమ్మవారికి పోతును బలి ఇచ్చారు గ్రామస్థులు. అనంతరం మాంసం పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నందికొట్కూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు. మరో ఇద్దరిని అత్యవసర చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: సైబర్ క్రైమ్ లో రష్యా టాప్..భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?

#kurnool #ugadi-festival #meat-fight
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe