సాల్ట్​తో క్యాన్సర్ ముప్పు..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

ఉప్పు లేనిదే ఓ వంట కూడా రుచించదు. అయితే ఈ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు 40 శాతం పెరిగుతుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇంతకీ ఉప్పు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు నిజంగానే పెరుగుతుందా? పరిశోధకులు ఏమి చెప్తున్నారు? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

New Update
సాల్ట్​తో క్యాన్సర్ ముప్పు..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

యూకేలో తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఉప్పు తక్కువగా వాడేవారితో పోలిస్తే.. ఎక్కువగా వాడే వ్యక్తుల్లో Stomach Cancer వచ్చే ప్రమాదం 41 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. వియన్నా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ పబ్లిక్ హెల్త్ చేసిన ఇటీవలి అధ్యయనంలో భాగంగా ఉప్పు తక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే చైనా, జపాన్, కొరియాలో చేసిన పరిశోధనలు కూడా Stomach Cancer ప్రమాదాన్ని పెంచుతున్నట్లు తెలిపాయి. అధిక ఉప్పు కడుపులోని రక్షిత పొరను బలహీన పరుస్తుందని మునపటి పరిశోధన తెలిపింది. దీనివల్ల కణజాలం పూర్తిగా దెబ్బతిని.. క్యాన్సర్ మార్పులు సంభవిస్తాయని తెలిపింది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలని పరిశోధకులు చెప్తున్నారు.

ఉప్పు, కడుపులో వచ్చే క్యాన్సర్​కు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ తాజా పరిశోధన హైలైట్ చేస్తుంది. సిఫార్సు చేసిన దానికంటే రోజువారీ ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదని చెప్తోంది. ప్రతిరోజూ 2300 mg కంటే ఎక్కువ సోడియం తినకూడదని సూచిస్తున్నారు. అంటే ఇది దాదాపు ఒక టీస్పూన్ ఉప్పుకు సమానం. అయినప్పటికీ.. వివిధ ఫుడ్​లలో ఉండే ఉప్పు వల్ల మోతాదు పెరుగుతుందని.. పరిశోధకులు గుర్తించారు. అమెరికాలో సగటున ఓ వ్యక్తి రోజుకు 3,400 మి.గ్రా ఉప్పు తీసుకుంటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. రుచిని పెంచుకోవడం కోసం కొంచెం ఉప్పును వేసుకోవడం ఆరోగ్యానికి హాని చేయదు అనుకుంటారు కానీ.. ఇదే ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

ఈ పరిశోధనపై 11 సంవత్సరాల సమయం వెచ్చించారు. ఉప్పును ఎక్కువగా తీసుకునే వ్యక్తులు అరుదుగానే ఉన్నా.. వారిలో కడుపు క్యాన్సర్ అభివృద్ధి 41 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఇదే కాకుండా.. వయసు, సామాజిక, ఆర్థిక స్థితి, ఆల్కహాల్, పొగాకు వినియోగం వంటివి కూడా దీని ప్రమాదాన్ని పెంచుతున్నాయని వారు తెలిపారు. 2024లో యూఎస్​లో సుమారు 26వేలకు పైగా stomach cancer కేసులు నమోదయ్యాయని.. సుమారు 11 వేలమంది మరణిస్తున్నారని అంచనా వేశారు. ఈ క్యాన్సర్​ను ముందుగానే గుర్తిస్తే.. చికిత్సతో తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. అయితే దీనిని గమనించకుండానే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని అందుకే అలెర్ట్​గా ఉండాలని సూచిస్తున్నారు. కడుపు ఉబ్బరం, నొప్పి, అజీర్ణం వంటి ప్రారంభ సంకేతాలుగా చెప్తున్నారు.

Advertisment
తాజా కథనాలు