ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు బుమ్రాకే!

జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును బుమ్రాకి దక్కింది. టీ20 వరల్డ్ కప్ గెలవటంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన బుమ్రాకు ఐసీసీ ప్రధానం చేసింది.ఈ అవార్డ్ రేసులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘాన్ ప్లేయర్ రహ్మదుల్లా గుర్బాజ్ ఉన్నారు.

New Update
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు బుమ్రాకే!

టీ20 ప్రపంచకప్ క్రికెట్ సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. బుమ్రా ఈ సిరీస్‌లో అత్యుత్తమంగా 15 వికెట్లు పడగొట్టి కేవలం 4.17 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. దీంతో బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా ఐసీసీ అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసి, ఆ నెలలో ఆటగాడికి అవార్డును అందజేస్తుంది. జూన్ నెల బెస్ట్ ప్లేయర్ పోటీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత ఆటగాడు బుమ్రా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మదుల్లా గుర్బాజ్ పోటీ పడ్డారు.

భారత జట్టు టైటిల్ గెలవడానికి ప్రధాన కారణమైన బుమ్రా.. ఫైనల్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో బుమ్రాకు జూన్‌లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది. దీనిపై బుమ్రా మాట్లాడుతూ.. జూన్‌లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు నా జీవితంలో మరిచిపోలేని అనుభవం తర్వాత వచ్చింది.

అయితే వ్యక్తిగతంగా ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. మా జట్టు కోసం నేను బాగా రాణించి ప్రపంచకప్ గెలిచిన సంగతి నా జీవితంలో మర్చిపోలేను. ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న నా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు గురుబాష్‌లను అభినందిస్తున్నాను. ఈ అవార్డును వినమ్రంగా స్వీకరిస్తున్నాను. అలాగే, నా కుటుంబం, సహచరులు, కోచ్‌లు, అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సపోర్టే నన్ను మరింత కష్టపడి పనిచేసేలా ప్రోత్సహిస్తోందని బుమ్రా అన్నాడు.

Advertisment
తాజా కథనాలు