దేశవాళీ క్రికెటర్ల రొట్టె విరిగి నేతిలో పడింది. వచ్చే సీజన్ నుంచి మ్యాచ్ ఫీజు ఇక రెట్టింపు కానుంది. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్లో అంతర్జాతీయ క్రికెటర్లు, ఐపీఎల్ కాంట్రాక్టులు పొందిన ఆటగాళ్లు కోట్లకు పడగలెత్తుతుంటే..ఒళ్లు హూనం చేసుకొంటూ దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లు ఆడే క్రికెటర్లు మాత్రం లక్షల రూపాయల మ్యాచ్ ఫీజులతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయితే..ఈ పరిస్థితిని సరిదిద్దాలని బీసీసీఐ గట్టిగా నిర్ణయించింది.
పూర్తిగా చదవండి..Ranji Trophy: రంజీ క్రికెటర్ల పంట పండింది.. ఇక సీజన్ కు కోటి?!
భారత దేశవాళీ క్రికెటర్ల నెత్తిన పాలు పోయాలని..ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి రంజీట్రోఫీ మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు భారీగా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని భావిస్తోంది. సీజన్ కు 75 లక్షల నుంచి కోటి వరకూ..ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తుంది.
Translate this News: