TGPSC: తెలంగాణలో టీజీపీఎస్సీ జూన్ 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో జరిగిన పరీక్షతో పోలిస్తే ఈసారి ఏకంగా 12.63 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.02లక్షల మంది పరీక్ష రాశారు. మొత్తంగా 74 శాతం హాజరు నమోదైంది. గతంలో రద్దయిన రెండు ప్రిలిమినరీ పరీక్షలను పరిగణనలోకి తీసుకుంటే సంఖ్యాపరంగా మూడు లక్షలకు మందికి పైగా అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Telangana: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డుస్థాయిలో హాజరు.. ఎంత శాతం పెరిగిందంటే!
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డు స్థాయిలో హాజరు శాతం నమోదైంది. గతంతో పోలిస్తే 12.63 శాతం పెరగగా మొత్తం 74 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 563 పోస్టులకు 4.03 లక్షల దరఖాస్తులు రాగా 3.02లక్షల మంది పరీక్ష రాశారు.
Translate this News: