TGPSC: తెలంగాణలో గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 563 పోస్టులకుగానూ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 897 కేంద్రాల్లో 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించగా.. 3.02 లక్షల మంది (దాదాపు 74%) హాజరైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది. త్వరలోనే ఈ పరీక్షకు సంబంధించిన కీ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచబోతున్నామని, గ్రూప్-1 మెయిన్స్ అక్టోబరు 21 నుంచి మొదలవుతాయని స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..Group-1 Prelims: గ్రూప్1 ప్రశ్నల సరళిపై ఉద్యమకారుల ఆందోళన.. టీజీపీఎస్సీ తీరుపై ఫైర్!
తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ లో ప్రశ్నల సరళిపై ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, త్యాగాలు, సంస్కృతిని గురించి ప్రశ్నలు అడగకుండా రేవంత్ సర్కార్ అవమానించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి
Translate this News: