Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌ లోనే ముగ్గురు మృతి!

జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌ లోనే ముగ్గురు మృతి!
New Update

Road Accident : జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణంలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు(Birthday) వేడుకలకు హాజరై కారులో తిరిగి వెళ్తున్న ఆరుగురు యువకులు.

గద్వాల పట్టణంలోని జమ్మిచేడు సమీపంలోకి వచ్చిన తరువాత కారు అతి వేగంతో రోడ్డు డివైడర్‌ ను బలంగా ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల నుంచి పెబ్బేరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని నరేష్(23), పవన్ కుమార్(28), ఆంజనేయులు(50) లుగా గుర్తించారు. గోవర్ధన్(20), నవీన్(20), మహబూబ్(23)లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also read: రష్మికతో నిశ్చితార్థం గురించి క్లారిటీ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ!

#3-people-die #jogulamba-gadwala #road-accident #gadwala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe