ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మంత్రి జోగి రమేష్ అనుచరులు హల్చల్ సృష్టించారు. బోసుబొమ్మ సెంటర్లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిష్టిబొమ్మను మంత్రి అనుచరులు దగ్ధం చేశారు. జి.కొండూరు జెడ్పీటీసీ మందా జక్రి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. చంద్రబాబు డౌన్ డౌన్.. బీసీ మంత్రి జోగి రమేష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పక్క మండలాల నాయకులు వచ్చి మైలవరంలో నిరసన తెలపడంపై స్థానిక ప్రజలకు చర్చించుకుంటున్నారు. మంత్రి అనుచరుల నిరసనకు స్థానిక వైసీపీ నాయకులు దూరంగా ఉన్నారు. స్థానిక నాయకులు రాకపోవడంతో వైసీపీలో అంతర్గత వర్గ పోరు బహిర్గతమైంది. 30 యాక్ట్ అమలులో ఉన్నా వైసీపీ నాయకుల నిరసన వైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. పట్టుమని పాతికమంది వైసీపీ నాయకులు లేకపోయినా ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కానీ పోలీసులు మాత్రం ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. పోలీసులు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..మైలవరంలో ఉద్రిక్తత.. వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. రోజురోజుకు పోటాపోటీగా టీడీపీ- వైసీసీ నేతల మధ్య యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు అనుచరులతో దాడులకు దిగుతున్నారు. తాజాగా మైలవరంలో ఇలాంటి ఘటన ఒకటి కలకలం రేపుతుంది.
Translate this News: