లెబనాన్‌లో ఉద్రిక్తత.. భారతీయులకు హెచ్చరిక!

ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది.దీంతో లెబనాన్‌లోని  రాయబార కార్యాలయం నిన్న సోషల్ మీడియాలో భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని పోస్ట్ లో పేర్కొంది.బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయంతో అందుబాటులో ఉండాలని పోస్ట్ లో సూచించింది.

New Update
లెబనాన్‌లో ఉద్రిక్తత.. భారతీయులకు హెచ్చరిక!

పశ్చిమాసియా దేశమైన ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్ 8 న ఇరువర్గాల మధ్య ఈ సరిహద్దు వివాదం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ నెలుృ 27వ తేదీన ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా రాకెట్ దాడి చేసింది. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా 12 మంది మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.

ఈ సందర్భంలో, లెబనాన్‌లోని  రాయబార కార్యాలయం నిన్న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. లెబనాన్‌లోని భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని పోస్ట్ లో పేర్కొంది. వారు తమ ఇమెయిల్ చిరునామా ద్వారా బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయంతో అందుబాటులో ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల కోసం, cons.beirutmea.gov లేదా +961 7686 0128ని సంప్రదించమని పోస్ట్ లో వివరించింది.

Advertisment
తాజా కథనాలు