America : అమెరికా రోడ్డు ప్రమాదంలో బాపట్ల విద్యార్థి మృతి!

ఏపీకి చెందిన బాపట్ల జిల్లా పర్చూరు కు చెందిన బోడవాడ గ్రామానికి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్‌ (22) గతేడాది డిసెంబర్‌ లో ఎంఎస్‌ చేసేందుకు యూఎస్‌ వెళ్లినట్లు సమాచారం.కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ఆ ప్రమాదంలో రేవంత్‌ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

America : అమెరికా రోడ్డు ప్రమాదంలో బాపట్ల విద్యార్థి మృతి!
New Update

USA : ఉన్నత చదువులు చదివి ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశపడిన ఆ తెలుగు విద్యార్థి కలలు అన్ని రోడ్డు ప్రమాదం(Road Accident) లో ఆవిరి అయిపోయాయి. అమెరికా(America) లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఏపీ(AP) కి చెందిన బాపట్ల(Bapatla) జిల్లా పర్చూరు కు చెందిన బోడవాడ గ్రామానికి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్‌ (22) గతేడాది డిసెంబర్‌ లో ఎంఎస్‌ చేసేందుకు యూఎస్‌ వెళ్లినట్లు సమాచారం.

రేవంత్(Revanth) ప్రస్తుతం మాడిసన్‌ పరిధిలోని డకోట్‌ స్టేట్ యూనివర్సిటీ(Dakota University) లో ఎంఎస్(MS) చేస్తున్నాడు. మంగ‌ళవారం ఉద‌యం రేవంత్‌ ఓ బర్త్‌డే వేడుకల కోసం ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ఆ ప్రమాదంలో రేవంత్‌ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

వాతావ‌ర‌ణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న మార్పుల కార‌ణంగా ద‌ట్ట‌మైన పొగ మంచు క‌మ్ముకోవ‌డంతో కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో రేవంతో పాటు ముగ్గురు స్నేహితుల‌కు కూడా తీవ్ర గాయాల‌య్యాయి. అయితే, రేవంత్ చ‌నిపోయిన‌ట్లు అధికారులు ధృవీకరించారు.

రేవంత్ మృతితో అత‌ని స్వ‌స్థ‌లం బోడ‌వాడ‌లో విషాదం అలుముకుంది. కాగా, రేవంత్ త‌ల్లి కొన్నేళ్ల క్రితం మ‌ర‌ణించ‌గా, తండ్రి ర‌ఘుబాబు ఫిజియోథెర‌పిస్టుగా ప‌నిచేస్తున్నారు. ఉన్న‌త విద్య కోసం అమెరికా వెళ్లిన కుమారుడు ఇలా అర్థాంత‌రంగా కన్నుమూయడంతో తండ్రి గుండెల‌విసెలా రోదిస్తున్నాడు.

Also Read : పెన్షన్ల పంపిణీలో పై నేడు హైకోర్టులో విచారణ

#road-accident #student #america #bapatla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe