Vishaka: 'జగన్ విశాఖ నుంచి పోటీ చేసి గెలవాలి... లేదంటే పులివెందుల వచ్చి ఓడిస్తా'

సీఎం జగన్ కు ఉత్తరాంధ్ర పై నిజంగా ప్రేమ ఉంటే " విశాఖ " నుంచి తన పై పోటీ చేసి గెలవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సవాల్ చేశారు. ఒకవేళ జగన్ విశాఖ నుంచి పోటీ చేయకపోతే తానే పులివెందుల వచ్చి జగన్ పై పోటీ చేసి గెలుపొందుతానని ధీమ వ్యక్తం చేశారు.

New Update
Vishaka: 'జగన్ విశాఖ నుంచి పోటీ చేసి గెలవాలి... లేదంటే పులివెందుల వచ్చి ఓడిస్తా'

Vishaka: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పై నిజంగా ప్రేమ ఉంటే " విశాఖ " నుంచి తన పై పోటీ చేసి గెలవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సవాల్ చేశారు. ఒకవేళ జగన్ విశాఖ నుంచి పోటీ చేయకపోతే తానే పులివెందుల వచ్చి జగన్ పై పోటీ చేసి గెలుపొందుతానని ధీమ వ్యక్తం చేశారు. ఇదే విషయమై వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాలకు పైగా బెయిల్ పై ఉన్న వ్యక్తి వైయస్ జగన్ అని విమర్శలు చేశారు. ఆయన పరిపాలనలో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు.

Also Read: శ్రీనాధ్ ను చంపేసింది భార్యేనా? హత్య వెనుక ఇంత పెద్ద కారణముందా?

రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైన ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికలలో ఓటమి భయం నేపథ్యంలో అక్రమంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే దుర్మార్గపు చర్యకు వైయస్ జగన్ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి పై సెక్షన్ 124 (ఎ), 409, 420 ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులలో తెలుగు శక్తి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందన్నారు. ఫలితంగా ఈనెల 22, 23 తేదీలలో ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చి ఓట్ల తొలగింపు వ్యవహారంపై పరిశీలన చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ క్యాడర్ లో భయం పట్టుకుందని.. ఎక్కడ ఓడిపోతామోనని ఒక్కొక్కరిగా వైసిపి మంచి జారిపోతున్నారని ఎద్దెవ చేశారు.

Advertisment
తాజా కథనాలు