Mahbubnagar: బండపై భోజనాలు..ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా..?

ఎక్కడైన భోజనాలు చేస్తే విస్తారాకుల్లోనో, ప్లేట్లలోనూ తింటాము. కానీ ఈ జిల్లాలోని ఈ గ్రామస్థులు మాత్రం బండ రాయిపై భోజనాలు చేస్తారు. అంతేకాదు అనాదిగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అంటే బండపైనే అన్నం కలుపుకొని తినేస్తారంట. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అసలు విషయం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Mahbubnagar: బండపై భోజనాలు..ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా..?

ఇస్తరాకులు-ప్లేట్లు లేకుండా..
శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఆ ఊరంతా అనాదిగా వస్తున్న ఆచారాని పాటిస్తున్నారు. గ్రామ శివారులోనీ గుట్టపై ఉన్న దేవునికి ఎంతో నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. అనంతరం ఊరంతా విందు చేసుకుంటారు. అయితే ఇక్కడ ప్లేట్లు గానీ.. ఇస్తరాకులు గానీ వాడకుండా భూజిస్తారు. ఇంతకీ ఈ వింత ఎక్కడ ఆచారం విశేషాలు ఎక్కడో చూద్దాం.

సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామే..
మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వేంకటగిరి గ్రామంలో శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో గ్రామ శివారులో ఓ దేవాలయం వద్ద తొక్కుడు బండాపై ఎలాంటి ఇస్తరాకులు, ప్లేట్లు లేకుండా బొంజేస్తూ గ్రామస్తులు వింత ఆచారం పాటిస్తున్నారు. పూర్వపు రెండు వందల ఏళ్ళ క్రితం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి మొదటి కాళ్ళు బండపై మోపాడు, రెoడవ కాళ్ళు బొల్లిగట్టుపై మోపి కురుమూర్తి గుట్టలపై వెలసినాడని గ్రామస్తులు తెలియజేసారు.

క్షేమంగా ఉంటారని భక్తుల నమ్మకం
శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున గ్రామస్తులందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి బియ్యం, నూనె,చింతపండు, ఉల్లిగడ్డలు అన్నీ సేకరించి పాదం బండ దగ్గరికి వచ్చి వంటలు చేసుకుంటారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి అటువైపు వెళ్తూ పాదం మోపాడనీ.. స్వామి వారి పాదానికి గుడి కట్టించి ఆనవాయితీ ప్రకారం 200 సంవత్సరాల నుంచి ఉత్సవాలు అక్కడి భక్తులు నిర్వహిస్తున్నారు. బండ రాతిపై గ్రామస్తులంతా కలిసి అక్కడే వనభోజనం చేస్తారు భక్తులు. బండరాయిపై భోజనాలు చేయడం ఏంటి ఆశ్చర్య పోతున్నారా.? కానీ నిజంగానే ఇక్కడి ప్రజలు అలానే భోజనం చేస్తారు. రాతి బండ పై ఎలాంటి విస్తరాకులు లేకుండా సహాపంక్తి భోజనం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల గ్రామస్థులందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, గొడ్డు గోదా గ్రామస్తులంతా క్షేమంగా ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం.

Advertisment
తాజా కథనాలు